హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కలకలం

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి […]

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కలకలం
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 7:58 AM

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కృష్ణవేణి పేరును షబానాగా మార్పించాడు.

మొదట్లో బాగానే ఉన్న రఫీక్ ఆ తర్వాత వేధించడం ప్రారంభించాడని బాధితురాలు తెలిపింది. గర్భం దాల్చిన తర్వాత పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. నాలుగు సార్లు అబార్షన్ చేయించాడని తెలిపింది. తాజాగా మరోసారి తాను మరోసారి గర్భం దాల్చాక తనను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రఫీక్‌పై పోలీసులకు ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కూడా అతణ్ని స్టేషన్‌కు పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన రఫీక్ కోసం గాలింపు చేపట్టారు.

భాగ్యనగరంలో మూడు నెలల కిందట లవ్ జిహాద్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను మతం మార్చి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను మత మార్పిడి చేసి, ఎవరికీ తెలియకుండా దాచారంటూ మంచిర్యాలకు చెందిన రేణుక, మహేశ్ దంపతులు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్కృతి ఇప్పుడు హైదరాబాద్‌లోనూ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది..