రెవెన్యూ అధికారిని చితక్కొట్టిన మహిళా రైతు
ఓ రెవెన్యూ అధికారిని ఓ మహిళా రైతు చెప్పుతో చితక్కొట్టింది. తమకు అన్యాయం చేసిన అధికారి దానిని సవరించమంటే నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ సదరు అధికారిని నోటికొచ్చిన తిట్లు తిట్టింది. తిట్లతో ఆగకుండా కాలికున్న చెప్పు తీసి.. చితకొట్టేసిందా మహిళా రైతు.
Woman farmer attacks revenue officer: భూముల నమోదులోను, పాస్ బుక్కుల జారీలోను అక్రమాలకు పాల్పడుతూ తమకు అన్యాయం చేస్తున్నాడన్న ఆగ్రహంతో మహిళా రైతులిద్దరు ఓ రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడిన ఉదంతం మంచిర్యాల జిల్లాలో జరిగింది. సదరు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ రైతులు అతనిపై చెప్పుతో దాడి చేశారు. చెప్పుతో చితకబాదుతూ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా తాంసి మండలం వడ్డాడి కప్పర్ల గ్రామంలో అన్నదమ్ముల మధ్య వ్యవసాయ భూపంపకాలు ఒకరకంగా జరగ్గా.. రెవెన్యూ అధికారి వారిలో ఒకరితో కుమ్మక్కై ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ భూమి నమోదు చేశాడు. పద్నాలుగు ఎకరాలను సమానంగా పంచుకోగా.. రెవెన్యూ అధికారి నిర్వాకంతో ఒకరికి 9 ఎకరాలు, మరొకరికి 5 ఎకరాలు తేలాయి. ఈ విషయంలో న్యాయం చేయాలంటూ బాధితులు అధికారులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు.
దానికితోడు.. తమకు మిగిలిన భూమిని సైతం కాజేసేందుకు సదరు రెవెన్యూ అధికారి కుట్ర పన్నాడని ఆరోపిస్తున్న మహిళా రైతులు రెవెన్యూ కార్యాలయంలోనే అతనిపై దాడి చేశారు. చెప్పుతో చితక్కొట్టారు. భూ ప్రక్షాళనలో తమ పాస్ బుక్కుల్లో తక్కువ భూమి నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు ఉన్నతాధికారులను కోరారు.
ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా
ALSO READ: అమితాబ్పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు
ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్