కారులో చెలరేగిన మంటలు.. తల్లీబిడ్డలు సజీవదహనం

న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఆమె కుమార్తెలు ఇద్దరు సజీవదహనమయ్యారు. ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా తన ముగ్గురు కుమార్తెలతో అక్షర్‌ధామ్‌ దేవాలయానికి కారులో వెళ్తున్నారు. అక్కడి ఫ్లైఓవర్‌ మీదకు రాగానే.. కారు వెనుక భాగంలో నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో రంజన మిశ్రా, కుమార్తెలు రిధి, నిక్కి ప్రాణాలు కోల్పోయారు. సీఎన్జీ గ్యాస్‌ లీక్‌ […]

కారులో చెలరేగిన మంటలు.. తల్లీబిడ్డలు సజీవదహనం
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 1:20 PM

న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఆమె కుమార్తెలు ఇద్దరు సజీవదహనమయ్యారు. ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా తన ముగ్గురు కుమార్తెలతో అక్షర్‌ధామ్‌ దేవాలయానికి కారులో వెళ్తున్నారు. అక్కడి ఫ్లైఓవర్‌ మీదకు రాగానే.. కారు వెనుక భాగంలో నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో రంజన మిశ్రా, కుమార్తెలు రిధి, నిక్కి ప్రాణాలు కోల్పోయారు. సీఎన్జీ గ్యాస్‌ లీక్‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు డ్రైవ్‌ చేస్తున్న ఉపేంద్ర మిశ్రా.. ముందు సీట్లో కూర్చొన్న మరో కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.