ఆ జాబితాలో రోహిత్ పేరు లేకపోవడం చూసి షాక్కి గురయ్యా..!
2019 సంవత్సరానికి గానూ విజ్డెన్ ప్రకటించిన ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ పేరు లేకపోవడం చూసి షాక్కు గురయ్యానని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
2019 సంవత్సరానికి గానూ విజ్డెన్ ప్రకటించిన ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ పేరు లేకపోవడం చూసి షాక్కు గురయ్యానని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ప్రపంచకప్ కంటే యాషెస్ సిరీస్ పెద్దదేం కాదు. అలాంటి టోర్నీలో రోహిత్ ఐదు శతకాలు కొట్టాడు. కఠినమైన సౌతాంప్టన్ పిచ్పై దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఇతర ఆటగాళ్లు పరుగులు తీయడానికి కష్టపడితే.. రోహిత్ మాత్రం అద్భుతంగా ఆడి సెంచరీలు చేశారు. పాకిస్థాన్తో మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడారు. అలాంటి ఆటగాడిని పరిగణలోని తీసుకోకపోవడం షాక్కు గురయ్యా. క్రికెట్ గురించి తెలిసిన ఎవరికైనా.. ఈ జాబితాలో హిట్మ్యాన్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు అని లక్ష్మణ్ అన్నారు. కాగా విజ్డెన్ ప్రకటించిన జాబితాలో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చన్, మార్నస్ లబుషేన్, అలీస్ పెర్రీ, సిమోన్ హర్మర్లు స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.
Read This Story Also: అక్కడ మా మాతృమూర్తి కాదు.. కానీ..!