విప్రో బోనస్ ఇష్యూ

స్టాక్ మార్కెట్ లో విప్రో షేరు సోమవారం హల్ చల్ చేసి౦ది. బోనస్ ఇష్యూ, అధీకృత వాటా మూలధనం పెంపునకు వాటాదారుల ఆమోదం లభించడంతో షేరు ర్యాలీ చేసింది. షేరు ఇంట్రాడేలో 2 శాతం పెరుగుదలతో రూ.386.70 స్థాయిని తాకింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. ఇకపోతే విప్రో షేరు చివరకు 1.76 శాతం పెరుగుదలతో రూ.385.4 వద్ద క్లోజయ్యింది. కంపెనీ బోనస్ ఈక్విటీ షేర్ల జారీకి మార్చి 7ను రికార్డ్ తేదీగా పేర్కొంది. బోనస్ […]

విప్రో బోనస్ ఇష్యూ
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:40 PM

స్టాక్ మార్కెట్ లో విప్రో షేరు సోమవారం హల్ చల్ చేసి౦ది. బోనస్ ఇష్యూ, అధీకృత వాటా మూలధనం పెంపునకు వాటాదారుల ఆమోదం లభించడంతో షేరు ర్యాలీ చేసింది. షేరు ఇంట్రాడేలో 2 శాతం పెరుగుదలతో రూ.386.70 స్థాయిని తాకింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. ఇకపోతే విప్రో షేరు చివరకు 1.76 శాతం పెరుగుదలతో రూ.385.4 వద్ద క్లోజయ్యింది. కంపెనీ బోనస్ ఈక్విటీ షేర్ల జారీకి మార్చి 7ను రికార్డ్ తేదీగా పేర్కొంది. బోనస్ షేర్ల ఇష్యూకి బోర్దు ఆమోదం తెలిపిందని కంపెనీ జనవరిలోనే ప్రకటించింది. ప్రతి మూడు షేర్లకు ఒక షేరును బోనస్‌గా ఇవ్వనుంది. మరోవైపు కంపెనీ వద్ద అధీకృత వాటా మూలధనం రూ.1,126.5 కోట్ల నుంచి రూ.2,526.5 కోట్లకు పెరిగింది.