టీడీపీలో ఆమె గురించే ఇప్పుడు చర్చంతా
విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని అనతి కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించారు. అన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడుతూ తనదైన ముద్రను పార్టీలో వేశారు. అన్ని అంశాలపై టీడీపీని డిఫెండ్ చేస్తూ ప్రత్యర్ధులను చిక్కుల్లో నెట్టే ప్రయత్నంలో ఆమె విజయం సాధించారు. చాలా కాలంగా పార్టీలో ఉన్న పలువురు టీడీపీ మహిళా నేతలకు కూడా లేని పేరు యామినికి దక్కింది. దీంతో ఆమె పాత్ర భవిష్యత్ టీడీపీలో ఏమిటనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. […]
విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని అనతి కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించారు. అన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడుతూ తనదైన ముద్రను పార్టీలో వేశారు. అన్ని అంశాలపై టీడీపీని డిఫెండ్ చేస్తూ ప్రత్యర్ధులను చిక్కుల్లో నెట్టే ప్రయత్నంలో ఆమె విజయం సాధించారు.
చాలా కాలంగా పార్టీలో ఉన్న పలువురు టీడీపీ మహిళా నేతలకు కూడా లేని పేరు యామినికి దక్కింది. దీంతో ఆమె పాత్ర భవిష్యత్ టీడీపీలో ఏమిటనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి చేస్తారు? ఉత్కంఠ ఎక్కువగా ఉంది.
అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు యామిని సాధినేని తాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపుతోందట. ఇక్కడ నుంచి గతంలో టీడీపీ తరుపున గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారు.
కాబట్టి ఈ సీటు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. మరీ ఈ సీటు కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది? యామిని సాధినేని కోరుకుంటున్నట్టు ఇక్కడి నుంచే ఆమెకు అవకాశం ఇస్తారా అనేవి ఆసక్తికరంగా మారాయి. అయితే యామిని సాధినేని గులిచి అసెంబ్లీలో అడుగు పెడితే మాత్రం తనదైన శైలిలో పార్టీకి, ప్రజావాణి వినిపించే క్రమంలో ప్రజాస్వామ్యానికి మంచి పేరు తీసుకువస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.