మధ్యంతరానికి బీ రెడీ: యడ్యూరప్ప
కర్ణాటక తాజా రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని.. రాష్ట్రంలో 28 సీట్లకుగాను 25 సీట్లు గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, జేడీఎస్లతో తమ ఎమ్మెల్యేలెవరూ సంప్రదింపులు జరపడంలేదని స్పష్టం చేశారు. తామంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుపై తానేమీ చెప్పలేనని.. ఏది జరిగాలో అది […]
కర్ణాటక తాజా రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని.. రాష్ట్రంలో 28 సీట్లకుగాను 25 సీట్లు గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, జేడీఎస్లతో తమ ఎమ్మెల్యేలెవరూ సంప్రదింపులు జరపడంలేదని స్పష్టం చేశారు. తామంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుపై తానేమీ చెప్పలేనని.. ఏది జరిగాలో అది జరగుతుందన్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లనున్నట్టు తెలిపారు.
Former Karnataka CM & BJP leader BS Yeddyurappa in Bengaluru: We have won 25 out of 28 seats in Karnataka. It is a historic win. It is better if the government is dissolved and mid-term polls are held. No BJP MLA is in touch with Congress or JD(S). pic.twitter.com/iCxohPQsJZ
— ANI (@ANI) May 28, 2019