మరిదితో అక్రమసంబంధం.. భర్తను చంపిన భార్య

ప్రియుడి మోజులో పడి కట్టకున్న భర్తను కాటికి పంపింది ఓ కసాయి. వరుసకు మరిది అయిన వ్యక్తితో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళ భర్త అడ్డు తొలగించుకుంది. వికారాబాద్‌ పట్టణ శివారులోని అనంతగిరి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది.

మరిదితో అక్రమసంబంధం.. భర్తను చంపిన భార్య
Follow us

|

Updated on: Jul 15, 2020 | 7:36 PM

ప్రియుడి మోజులో పడి కట్టకున్న భర్తను కాటికి పంపింది ఓ కసాయి. వరుసకు మరిది అయిన వ్యక్తితో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళ భర్త అడ్డు తొలగించుకుంది. వికారాబాద్‌ పట్టణ శివారులోని అనంతగిరి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బైండ్ల చెన్నయ్య(38), శశికళ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ప్రవీణ్‌, పావనిలు ఇద్దరు సంతానం. వరుసకు మరిది అయిన రమేష్‌తో ఆరేళ్లుగా శశికళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. మద్యానికి బానిసైన భర్త చెన్నయ్య తరచూ భార్యతో గొడవపడేవాడు. భార్య శశికళ అసలు భాగోతం బయటపడడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో విసుగు చెందిన శశికళ భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియునితో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 6వ తేదీన ముగ్గురు కలిసి బస్సులో పరిగికి చేరుకున్నారు. అక్కడే మద్యం కొనుగోలు చేశారు. అనంతగిరి అటవీ ప్రాంతానికి వచ్చి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న చెన్నయ్యపై భార్య శశికళ, రమేష్ రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహంపై చెత్త, చెట్ల ఆకులు కప్పి పారిపోయారు. ఏం ఎరుగనట్లు తిరిగి ఇంటికి చేరుకుంది శశికళ.

ఇదిలావుంటే, ఈ నెల 11న చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు గ్రామస్తులు, బంధువులు ఏర్పాట్లు చేశారు. అయితే, కుమారుడు చెన్నయ్య హాజరు కాకపోవడం, భార్య ఏమీ ఎరగనట్టు వ్యవహరించడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి ఈనెల 13వ తేదీన నిలదీశారు. ఈ విషయమై 14న పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. పంచాయతీ పెడితే అసలు విషయం బయటపడుతుందన్న భయంతో భార్య శశికళ 13వ తేదీ రాత్రి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కాలిన గాయాలతో ఉన్న ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే, ఈ పరిణామంతో శశికళతో చనువుగా ఉన్న రమేష్‌ను గ్రామస్తులు అనుమానించారు. రమేష్‌ను గ్రామస్తులు నిలదీయడంతో హత్యోదంతం బయటపడింది. అనంతగిరి అటవీ ప్రాంతంలో హత్య చేశామని మృతదేహాన్ని అక్కడే వదిలేశామని వివరించాడు. దీంతో గ్రామస్థులు వికారాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!