కాపురంలో ఫేస్‌బుక్‌ చిచ్చు.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

సభ్య సమాజంలో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో భార్య.

కాపురంలో ఫేస్‌బుక్‌ చిచ్చు.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Follow us

|

Updated on: Oct 19, 2020 | 2:16 PM

సభ్య సమాజంలో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట న్యూఇందిరానగర్‌కు చెందిన మహ్మద్‌ నాసర్‌(31) సమీప బస్తీకి చెందిన హలీమాబేగం అలియాస్‌ గౌసియా(27)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. గగన్‌పహాడ్‌లోని పెట్రోలు బంకులో పనిచేస్తున్న నాసర్ కుటుంబం ప్రశాంతంగా సాగుతుండగా ఫేస్‌బుక్‌ వారి కాపురంలో చిచ్చుపెట్టింది.

గౌసియాకు పహాడీషరీఫ్‌కు చెందిన షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌(22)తో ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగి… అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త నాసర్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో ఏమాత్రం మార్పులేదు. పైగా భర్త అడ్డు తొలగించుకోవాలని గౌసియా భావించింది. శనివారం రాత్రి హుస్సేన్‌తో కలిసి భర్తను దిండుతో నొక్కి, తాడుతో గొంతు బిగించి హతమార్చింది. తరువాత అత్త మరియంబేగం ఇంటికెళ్లి.. గుర్తుతెలియని వ్యక్తి నాసర్‌ను గొంతు నులిమాడని చెప్పింది. మరియంబేగం ఘటనా స్థలానికి చరుకొని స్థానికుల సాయంతో కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చిన నాసర్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందుతులను అదపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..