రోజాపై రాములమ్మ సింపతీ..
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, వారి సేవలను కూడా వినియోగించుకుని తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ రోజా […]
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, వారి సేవలను కూడా వినియోగించుకుని తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ రోజా విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు రాములమ్మ ట్వీట్ చేశారు.
కాగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సీఎం జగన్ కేబినెట్లో ఎమ్మెల్యే రోజాకు ప్లేస్ ఫిక్స్ అని అందరూ భావించారు. వైసీపీలో మొదటి నుంచి బలమైన వాయిస్ వినిపించిన నేతల్లో రోజా ఒకరు,. కానీ అనూహ్యంగా కేబినెట్ లిస్ట్లో రోజా పేరు కన్పించలేదు. ఈ విషయంలో రోజా కొంత అసంతృప్తికి గురయ్యారన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ సందర్భంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని,
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 11, 2019