అగ్రిమా జోషువాకు మ‌ద్ద‌తు ప‌లుక‌ని తోటి మ‌హిళా క‌ళాకారులు..రీజ‌న్ ఇదే..

ముంబైకి చెందిన స్టాండ్-అప్ కమెడియన్ అగ్రిమా జోషువాను రేప్ చేస్తానంటూ ఫోన్, సోష‌ల్ మీడియా ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ యూట్యూబ‌ర్‌ శుభమ్ మిశ్రాను గుజ‌రాత్‌లో వ‌డోద‌ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అగ్రిమా జోషువాకు మ‌ద్ద‌తు ప‌లుక‌ని తోటి మ‌హిళా క‌ళాకారులు..రీజ‌న్ ఇదే..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 10:52 PM

ముంబైకి చెందిన స్టాండ్-అప్ కమెడియన్ అగ్రిమా జోషువాను రేప్ చేస్తానంటూ ఫోన్, సోష‌ల్ మీడియా ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ యూట్యూబ‌ర్‌ శుభమ్ మిశ్రాను గుజ‌రాత్‌లో వ‌డోద‌ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార బెదిరింపుల కేసును సుమోటో కేసుగా తీసుకుని.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2019లో జ‌రిగిన ఓ ఈవెంట్ లో మ‌హారాష్ట్రలో ఆవిష్కృతం కానున్న ఛ‌త్ర‌ప‌తి శివాజీ స్టాట్యూపై అగ్రిమా జోషువా వివాదాస్ప‌ద కామెంట్స్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో అగ్రిమాపై స‌ద‌రు యూట్యూబ‌ర్ బెదిరింపుల‌కు దిగాడు.

అయితే ఈ విష‌యంలో జోషువాకు మ‌ద్ద‌తుగా ప‌లువురు సెలబ్రిటీలు నోరు విప్పారు. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోవాలి అంటూ ఆమె ప‌క్షాన వాదించారు. కానీ జోషువాకు అండ‌గా నిలిచేందుకు ఒక్క లేడీ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ కూడా ముందుకు రాలేదు. కేవలం జాషువాకు మద్దతు ఇచ్చినందుకు సోషల్ మీడియాలో త‌మ‌పై కూడా దాడికి పాల్ప‌డుతున్నార‌ని, బెదిరింపులకు సైతం దిగుతున్నార‌ని వారు వెల్ల‌డించారు. ఇది వారి కుటుంబాల‌కు కూడా ఇబ్బందిక‌రంగా మారడంతో మాట్లాడేందుకు జంకుతున్న‌ట్లు వివ‌రించారు.