అభినందన్కు మీరెందుకు స్వాగతం పలకలేదు: చంద్రబాబు
అమరావతి: ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అంతా అభినందన్ రాక కోసం ఎదురు చూస్తే ప్రధాని స్వాగతం పలకలేదని విమర్శించారు. దేశం గర్వపడేలా చేసిన వీర పైలట్ అబినందన్కు స్వాగతం పలికేందుకు వెళ్లని వ్యక్తి ఇక్కడకొచ్చి తమను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో మోడీ చేసిన విమర్శలకు చంద్రబాబు అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతి విమర్శలు చేశారు. అభినందన్ క్షేమంగా తిరిగొచ్చాడని మనమందరం సంబరంగా ఉంటే ప్రధాని మోదీ మాత్రం […]
అమరావతి: ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అంతా అభినందన్ రాక కోసం ఎదురు చూస్తే ప్రధాని స్వాగతం పలకలేదని విమర్శించారు. దేశం గర్వపడేలా చేసిన వీర పైలట్ అబినందన్కు స్వాగతం పలికేందుకు వెళ్లని వ్యక్తి ఇక్కడకొచ్చి తమను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో మోడీ చేసిన విమర్శలకు చంద్రబాబు అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతి విమర్శలు చేశారు.
అభినందన్ క్షేమంగా తిరిగొచ్చాడని మనమందరం సంబరంగా ఉంటే ప్రధాని మోదీ మాత్రం విశాఖ వచ్చి నల్లజెండాలతో స్వాగతం అందుకున్నారని చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. సౌదీ యువరాజు వస్తే స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన ప్రధానికి అభినందన్ వంటి దేశభక్తుడు కనిపించకపోవడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
యుద్ధం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో గెలుస్తామనుకుంటున్నారు. యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలే బీజేపీ రాజకీయానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. ప్రధాని చాలాకాలంగా మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అని చెబుతున్నారు. ఎన్నోసార్లు చెప్పారని, కనీసం వాటిలో ఒక్కటైనా జరిగిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.