మలికిపురంలో డిగ్గీరాజా..ఎందుకొచ్చాడంటే..?
జాతీయ రాజకీయాల్లో బిజీబిజీగా అనే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) సడన్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో తేలారు. ఎందుకా అన్న చర్చ ఇపుడు హాట్ హాట్ గా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం చేరుకున్న డిగ్గీ రాజా అక్కడ్నించి ప్రకృతి రమణీయతకు మారుపేరైన దిండి రిసార్ట్స్ కు వెళ్లారు. శనివారం అక్కడే బస చేయనున్నారు డిగ్గీ రాజా. ఏపీలో […]
జాతీయ రాజకీయాల్లో బిజీబిజీగా అనే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) సడన్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో తేలారు. ఎందుకా అన్న చర్చ ఇపుడు హాట్ హాట్ గా జరుగుతోంది.
తూర్పు గోదావరి జిల్లా మలికిపురం చేరుకున్న డిగ్గీ రాజా అక్కడ్నించి ప్రకృతి రమణీయతకు మారుపేరైన దిండి రిసార్ట్స్ కు వెళ్లారు. శనివారం అక్కడే బస చేయనున్నారు డిగ్గీ రాజా. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన సమయంలో అయన రాక పార్టీ కోసమే అని అందరు అనుకున్నారు కానీ. ఆయనొచ్చింది అందుకు కాదు అని తెల్సి అందరూ ఆశ్చ్యర్యపోయారు. కాంగ్రెస్ పెద్దల్లో ఒకరైన డిగ్గీ రాజా .. పార్టీ పనులతో సంబంధం లేకుండా ఏపీకి ఎందుకు వచ్చారు చెప్మా అని అందరు బుర్ర గోక్కుంటుంటే.. అసలు విషయం నెమ్మదిగా వెల్లడైంది. అదేంటంటే..
ఆదివారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అఖిల భారత క్షత్రియ సమాఖ్య సర్వ సభ్య సమావేశం జరుగనున్నది. క్షత్రియ సమాఖ్య ద్వారా జాతీయ స్థాయి నేతగా ఎదిగిన దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా తనకు రాజకీయంగా ఒక గుర్తింపు రావడానికి కారణమైన క్షత్రియ సమాఖ్య సర్వ సభ్య సమావేశంలో పాల్గొనేందుకు.. తద్వారా కాంగ్రెస్ పార్టీకి కోల్పోతున్న ప్రభావాన్ని కొంతైనా సాధించి పెట్టేందుకు వచ్చారన్న క్లారిటీ వచ్చేసింది. విషయం తెల్సిన తర్వాత ఓహ్ ఇదా సంగతి అనుకున్నారు గోదావరి జిల్లాల జనం. అదన్న మాట సంగతి..