హైడ్రాక్సీక్లోరోక్విన్ పై తాత్కాలిక నిషేధం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వ్యాధి చికిత్సలో వాడే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (కరోనా నివారణకు తానీ మందును రోజూ వాడుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మధ్య ప్రకటించిన విషయం గమనార్హం).
కరోనా వ్యాధి చికిత్సలో వాడే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (కరోనా నివారణకు తానీ మందును రోజూ వాడుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మధ్య ప్రకటించిన విషయం గమనార్హం). అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ మందు వినియోగాన్ని నిలిపివేయాలనే సూచనలు వచ్చాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసస్ తెలిపారు. అనేక ఆస్పత్రుల్లో కరోనా రోగులకు ఈ మెడిసిన్ వాడినప్పుడు కోలుకున్న వారి సంఖ్య కన్నా మృతుల సంఖ్యే ఎక్కువగా ఉందని లాన్సెట్ లో ప్రచురితమైన అధ్యయనం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా దీనిపై రివ్యూ నిర్వహించేందుకు డేటా ఫ్రీ మానిటరింగ్ బోర్డును ట్రయల్ స్టీరింగ్ కమిటీ వినియోగించుకుంటుందని ఆయన చెప్పారు. విషమ స్థితిలో ఉన్న రోగులకు ఈ మెడిసిన్ ను ఇఛ్చినపక్షంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయని, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని గతంలో పలువురు పరిశోధకులు పేర్కొన్న విషయాన్నీ అయన గుర్తు చేశారు. 17 దేశాల్లో సుమారు మూడున్నర వేలమంది రోగులకు ఈ మందును ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. కాగా…. డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు రెండు వారాల్లో తన నివేదికను వెలువరించనుంది.