‘తెల్ల పులి’ కిరణ్ చనిపోయింది
హైదరాబాద్ లోని నెహ్రూ జూలో 8 ఏళ్ల తెల్ల పులి(కిరణ్) గురువారం చనిపోయింది. అనారోగ్యంతోనే పులి చనిపోయినట్లుగా చెప్పారు అధికారులు...
హైదరాబాద్ లోని నెహ్రూ జూలో 8 ఏళ్ల తెల్ల పులి(కిరణ్) గురువారం చనిపోయింది. అనారోగ్యంతోనే పులి చనిపోయినట్లుగా చెప్పారు అధికారులు. ఎనిమిదేళ్ల క్రితం ఈ పులి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోనే జన్మించింది. దీనికి కిరణ్ అని పేరు పెట్టారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
పులి మెడకు వాపు కనిపించినప్పటి నుంచి వెటర్నరీ డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించారు. నెల రోజుల నుంచి పులి ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్లు పులి మెడ భాగం నుంచి కణితిని బయటికి తీశారు.
గత ఏడాది అగస్టు నెలలో 14 ఏళ్ల తెల్ల పులి(బద్రి) కూడా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తెల్ల పులి బద్రి కూడా ఇదే రకమైన అనారోగ్య సమస్యతో చనిపోయింది.
Kiran, a white male tiger aged about 8 years, born at the zoo, passed away on the morning of 25th June. The tiger was suffering from a neoplastic tumour in the right side of the lower jaw: Nehru Zoological Park, Hyderabad #Telangana pic.twitter.com/rScv8a7782
— ANI (@ANI) June 25, 2020