రెండు రాష్ట్రాల్లో చేదు నింపిన స్వీటు .. ఎందుకో తెలుసా?

ఒక్క స్వీటు ముక్క రెండు రాష్ట్రాలమధ్య చిచ్చుపెట్టింది. అదీ రెండు దక్షిణాది రాష్ట్రాలమధ్య. మైసూర్ పాక్.. ఈ పేరు విననివారంటూ ఎవరూ ఉండరేమో. కింగ్ ఆఫ్ స్వీట్స్ అని పిలిపించుకుంటున్న మైసూర్ పాక్ వివాదం ఇప్పడు పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదిన ఈ స్వీట్‌కి ఉన్న ఆదరణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మైసూర్ పాక్ ఏ ప్రాంతానికి చెందిన పదార్ధం అని ఎవరినడిగినా ఏం చెబుతారు? మైసూర్ అంటూ కర్ణాటకలో ఉంది గనుక అది కర్ణాటకకు […]

రెండు రాష్ట్రాల్లో చేదు నింపిన స్వీటు .. ఎందుకో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 6:14 PM

ఒక్క స్వీటు ముక్క రెండు రాష్ట్రాలమధ్య చిచ్చుపెట్టింది. అదీ రెండు దక్షిణాది రాష్ట్రాలమధ్య. మైసూర్ పాక్.. ఈ పేరు విననివారంటూ ఎవరూ ఉండరేమో. కింగ్ ఆఫ్ స్వీట్స్ అని పిలిపించుకుంటున్న మైసూర్ పాక్ వివాదం ఇప్పడు పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదిన ఈ స్వీట్‌కి ఉన్న ఆదరణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మైసూర్ పాక్ ఏ ప్రాంతానికి చెందిన పదార్ధం అని ఎవరినడిగినా ఏం చెబుతారు? మైసూర్ అంటూ కర్ణాటకలో ఉంది గనుక అది కర్ణాటకకు చెందిన పదార్ధమనే బదులిస్తారు. కానీ అది అక్కడివారిది కాదట. తమిళనాడుకు చెందిన పదార్ధమట. ఈ వివాదం ఎప్పటినుంచో నలుతూనే ఉంది. తాజాగా ఆనంద్ రంగనాధన్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కేంద్ర ఆర్షిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జర్నలిస్ట్ ఆనంద్ రంగనాథన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫోటో ట్వీట్టర్‌లో పోస్టుచేసి.. మైసూర్ పాక్‌కు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను తమిళనాడుకు కేటాయించినందుకు కృతఙ్ఞతలు అంటూ కామెంట్ రాశారు. అయితే ఈ వార్తను తమిళ, కన్నడ మీడియా ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్ నడిపాయి. దీంతో రచ్చ మొదలైంది. వాస్తవానికి కేంద్రం ఇప్పటివరకు మైసూర్ పాక్ విషయంలో ఎలాంటి జీఐ ట్యాగ్ ఎవరికీ కేటాయించలేదు. ఆయన ట్వీట్‌ను అర్ధం చేసుకోవడంలోనే పొరబాటు జరిగినట్టు గుర్తించాయి.

మైసూర్ పాక్ ఎక్కడిది?

ముందే చెప్పుకున్నాం కదా ! కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూరులో మాహారాజా శ్రీ ముమ్మది కృష్ణరాజా వాడియార్ ఆదేశాలతో వంటలు వండే కాకాసుర మడప్ప అనే వ్యక్తి రాజా వారి కోరిక మేరకు ప్రత్యేక మైన వంటకాన్ని తయారు చేశాడు. అదే మైసూర్ పాక్. స్ధానికంగా జంబో అశోక్ రోడ్డులో స్వీట్ మార్ట్ ప్రారంభించడంతో ప్రజలకు ఈ స్వీట్‌ను తెలియజేయడంలో తమ ముత్తాత అంటూ ఆయన ముని మనవడు నటరాజ్ అనే వ్యక్తి చెబుతున్నాడు. ఈ దుకాణాన్ని 60 ఏళ్ల క్రితమే సయ్యజీరావు రోడ్‌కు మార్చామని చెప్పాడు. తమ వంశం మొత్తం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమది ఐదవ తరమని, మా పిల్లలు కూడ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారని నటరాజ్ చెప్పాడు. సరదా కోసం ఇలాంటి ట్వీట్ చేయవద్దని, మైసూరుకు చెందిన ఈ స్వీట్‌కు తమిళనాడుకు ఎలా చెందుతుందని ప్రశ్నించాడు నటరాజ్.

తిరుపతి లడ్డూకు జీఐ ట్యాగ్..

ఇప్పటికే జీఐ ట్యాగ్ విషయంలో తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డూకు జీఐ ట్యాగ్ లభించింది. తిరుపతి కొండపై తయారయ్యే లడ్డూ ప్రసాదంపై టీటీడీ దేవస్థానానికి సర్వహక్కులు వచ్చాయి. దీన్ని ఎవరూ కాపీ కొట్టకుండా, బయటి వ్యక్తులు ఎవరూ తయారు చేయకుండా ఉండేందుకు స్పష్టమైన హక్కులన్నీ దీనిద్వారా లభించినట్టయింది. బయటి వ్యక్తులు, దుకాణాలు ఎవరు దీన్ని తయారుచేసినా ఈ కాపీరైట్ హక్కు అడ్డుకుంటుంది. దీనికి లడ్డూకి సంబంధించి ఇదొక రక్షణ వంటిదే. అదే విధంగా బందరులడ్డూ కూడా జీఐ ట్యాగ్ పొందింది. మనకు ఆయా వస్తువులు పలు దుకాణాల్లో లభ్యమవుతున్నప్పటికీ ఒరిజినల్‌గా అది ఏ ప్రాంతానికి చెందిందో దాన్ని గుర్తించడమే ఈ జీఐ ట్యాగ్ ముఖ్య ఉద్దేశ్యం. కంచిపురం చీరలు, నాగపూర్ కమలాలు, అల్ఫాన్సో మామిడీ ఇలా ఎన్నో రకాల పదార్ధాలు, వస్తువులకు పేటెంట్లు, జీఐ ట్యాగ్‌లు వాటికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు.

భౌగోళిక సూచికలు (జిఐ) అంటే ఏమిటి?

ఏదైనా ఒక ఉత్పత్తికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ప్రత్యేక గుర్తింపును సూచిస్తుంది. అసలైన పదార్ధం, లేక వస్తువుకు ఈ జీఐ ట్యాగ్ అనేది రక్షణ కల్పిస్తుంది. ఒక వస్తువు, లేక ఒక పదార్ధాన్ని ఎంతమందైనా తయారు చేసే వీలుంది. కానీ అది ఏదో ఒక ప్రాంతంలో ప్రసిద్ధి పొందడమో, అక్కడ తయారు చేయబడటమో జరుగుతూ ఉంటాయి. దీనినే ప్రామాణికంగా ఈ జీఐ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ వస్తువు ఎక్కవ తయారు చేయబడుతుంది అనే విషయంలో భౌగోళిక ప్రాంతాన్ని జీఐ ట్యాగ్ ద్వారా నిర్ధారించవచ్చు.

భారత్‌లో ఎప్పటినుంచి.. వస్తువుల భౌగోళిక సూచికలు (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్), 1999 అనేది పాలకమండలి, ఇది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ చేత నిర్వహించబడుతుంది, భౌగోళిక సూచికల రిజిస్ట్రార్ కూడా ఈ డిపార్ట్‌మెంట్ ఇస్తుంది. ఇది భౌగోళిక సూచికల వస్తువుల (రిజిస్ట్రేషన్ & ప్రొటెక్షన్) చట్టం, 1999, 15 సెప్టెంబర్ 2003 నుండి అమల్లోకి వచ్చింది.

బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు