ఇక ‘వాట్సాప్ పే’తో.. డిజిటల్ చెల్లింపులు!
ప్రముఖ సామజిక మాధ్యమం, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపుల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దశల వారీగా డిజిటల్ చెల్లింపుల ఫ్లాట్పాం వాట్సాప్ పే సేవలను ప్రారంభించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వాట్సాప్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్పీసీఐ నుంచి ఆమోదం లభించడంతో వాట్సాప్ పే యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. 40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్ తొలి దశలో […]
ప్రముఖ సామజిక మాధ్యమం, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపుల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దశల వారీగా డిజిటల్ చెల్లింపుల ఫ్లాట్పాం వాట్సాప్ పే సేవలను ప్రారంభించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వాట్సాప్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్పీసీఐ నుంచి ఆమోదం లభించడంతో వాట్సాప్ పే యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.
40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్ తొలి దశలో భాగంగా భారత్లో కోటి యూజర్లకు చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇతర నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టే క్రమంలో పూర్తిస్ధాయిలో వాట్సాప్ పే సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సమాచారం. వాట్సాప్ పే సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా మారుతుంది. వాట్సాప్ పే సేవల్లో జాప్యానికి కారణమైన డేటా లోకలైజేషన్ నిబంధనలపై నియంత్రణసంస్ధలకు భరోసా ఇవ్వడంతో క్లియరెన్స్లు లభించాయి.