హుజుర్ నగర్ ఫలితంతో.. బీజేపీ అధ్యక్షుడి దారెటు?

హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తాయి. కాలర్‌ ఎగిరేసి కమలం దూకుడు చూపాలని అనుకున్నారు. తీరా చూస్తే 2600 ఓట్లతో డిపాజిట్‌ గల్లంతు అయింది. ముందు నుంచి హుజుర్ నగర్‌లో గెలుస్తామనే ధీమా బీజేపిలో ఎక్కడా కనిపించలేదు. కానీ ఓ పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తే కాలర్‌ ఎగిరేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది కాస్తా సీన్‌ […]

హుజుర్ నగర్ ఫలితంతో.. బీజేపీ అధ్యక్షుడి దారెటు?
Follow us

|

Updated on: Oct 29, 2019 | 11:58 PM

హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తాయి. కాలర్‌ ఎగిరేసి కమలం దూకుడు చూపాలని అనుకున్నారు. తీరా చూస్తే 2600 ఓట్లతో డిపాజిట్‌ గల్లంతు అయింది. ముందు నుంచి హుజుర్ నగర్‌లో గెలుస్తామనే ధీమా బీజేపిలో ఎక్కడా కనిపించలేదు. కానీ ఓ పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తే కాలర్‌ ఎగిరేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది కాస్తా సీన్‌ రివర్స్‌ అయింది. ఇక ఈ ఉపఎన్నిక ఫలితంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తల పట్టుకున్నారు. జాతీయ నాయకత్వానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆయన తికమకపడుతున్నారట.

అసలే డిసెంబర్‌లో కొత్త రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంది. దీంతో ఇప్పటికే జోరుగా పైరవీలు నడుస్తున్నాయి. గ్రూపుల వారీగా లిస్టులు అధిష్టానానికి చేరాయి. డిసెంబర్‌లో లక్ష్మణ్‌ పదవీ కాలం ముగుస్తోంది. సెకండ్‌ టర్మ్‌ తనకు రెన్యువల్‌ ఉంటుందని లక్ష్మణ్‌ ఆశపడ్డారట. నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపు లక్ష్మణ్‌కు కొంత బలం ఇస్తే….హుజూర్‌నగర్‌లో ఓటమి ఇప్పుడు మైనస్‌గా మారింది.

రెండో టర్మ్ ప్రెసిడెంట్ కాకపోతే.. కనీసం రాజ్యసభ సీటు వస్తుందనే ఆశలో లక్ష్మణ్ ఉండగా.. హుజుర్ నగర్ ఫలితం తర్వాత ఆయన్ని కొనసాగించాలా? లేదా? అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక లక్ష్మణ్ భవిష్యత్తు ఏంటనేది మరో నెల రోజుల్లో తెలియనుంది.