అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్‌లు బంద్.. ‘ప్లాన్ B’ ఇదేనా..?

దసరా, బతుకమ్మ పండుగలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగలు. దీంతో.. నగరాల్లోని వారంతా.. పల్లెల్లో వాలిపోవాలని.. తమ కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని అనుకుంటారు. అందులోనూ.. బతుకమ్మ పండుగ తెలంగాణలో మరింత ముఖ్యమైనది. దాంతో.. హైదరాబాద్‌ నగరంలోని వారు తమ ఊర్లకు చేరాలనుకుంటారు. ఈ క్రమంలో.. చాలా కీలకం పనిచేసేది రవాణా. కానీ.. తెలంగాణలో మాత్రం సీన్ వేరేలా ఉంది. పండుగను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటోంది. ఆర్టీసీ సమ్మెతో.. ప్రభుత్వం గందరగోళంలో […]

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్‌లు బంద్.. 'ప్లాన్ B' ఇదేనా..?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 04, 2019 | 5:44 PM

దసరా, బతుకమ్మ పండుగలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగలు. దీంతో.. నగరాల్లోని వారంతా.. పల్లెల్లో వాలిపోవాలని.. తమ కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని అనుకుంటారు. అందులోనూ.. బతుకమ్మ పండుగ తెలంగాణలో మరింత ముఖ్యమైనది. దాంతో.. హైదరాబాద్‌ నగరంలోని వారు తమ ఊర్లకు చేరాలనుకుంటారు. ఈ క్రమంలో.. చాలా కీలకం పనిచేసేది రవాణా. కానీ.. తెలంగాణలో మాత్రం సీన్ వేరేలా ఉంది. పండుగను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటోంది. ఆర్టీసీ సమ్మెతో.. ప్రభుత్వం గందరగోళంలో పడింది. దీని పరిష్కారానికి కేసీఆరో ‘ప్లాన్‌ B’ని ఆలోచించారు. ఇంతకీ ఏంటా ‘ప్లాన్‌ బి’! దానికి ఆర్టీసీ ఎలా రెస్పాండ్‌ అవుతుందో చూడాలి.

ఆర్టీసీ సమ్మె.. తెలంగాణలో ప్రస్తుతం హాట్‌‌గా జరుగుతోన్న చర్చ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ సర్కార్‌ ఏర్పాటు చేసిన IAS అధికారుల కమిటీ చర్చలు చేపట్టింది. తొలిదఫా చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు చేపట్టారు. IAS కమిటీ తీరుపై ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తొలుత చర్చలకు పిలిచి.. RTA అధికారులతో ఐఏఎస్‌ కమిటీ భేటీ కావడంపై మండిపడ్డారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వ త్రిసభ్య కమిటీ తీరును నిరసిస్తూ చర్చల నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు వెనుదిరిగారు. సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వ త్రిసభ్య కమిటీ మరోసారి సూచించింది. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని సమ్మె వాయిదా వేసుకోవాలని కోరింది. కానీ దానికి ఆర్టీసీ సుముఖత వ్యక్తం చేయలేదు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే.. సమ్మె ఖాయమంటున్నారు. అయితే.. దీనిపై కేసీఆర్.. ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారట. అదే ‘ప్లాన్‌ బి’. అదేంటని అనుకుంటున్నారా..? ఆ వివరాల్లోకే వెళ్దాం.

గత నెల క్రితం.. ఏపీలోని కూడా ఇదే సమస్య తలెత్తింది. దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. తమ నిర్ణయం ప్రకటించారు. దీంతో.. ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే సమస్య.. తెలంగాణలోనూ ఎదురయ్యింది. ఆర్టీసీ కార్మికులతో.. ప్రభుత్వం చర్చలు జరిపినా.. సఫలం కావడం లేదు. అసలే ఇప్పుడు పండగ సీజన్. ఆర్టీసీకి భారీగా ఆదాయం చేకూరే సమయం. ఈ టైంలో ఆర్టీసీ కార్మికులు ఇలా చేయడం.. ప్రభుత్వానికి కాస్త తలనొప్పి వ్యవహారమే. అంతేకాకుండా.. అక్టోబర్ 5 నుంచి బస్ డిపో నుంచి ఒక్క బస్‌ కూడా రాదని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.

కాగా.. ఈ విధానానికి తాత్కాలికంగా.. చెక్ పెడుతూ.. కేసీఆర్ ‘ప్లాన్ B” అమలు పరచాలని చూస్తున్నారు. దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు సూళ్లకు, కాలేజీలకు, యూనివర్శిటీలకు వారం రోజులకు పైగానే సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో.. ఆ పాఠశాలల.. కాలేజీల బస్సులు, వెహికల్స్.. ఖాళీగా ఉంటాయి. అందులోనూ.. ఆర్టీసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో.. వాటిని నడపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు