పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే..!

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర ఘటన తర్వాత దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఈ దాడి వెనక ఉన్నది పాకిస్థానే అనే విషయం తొదరగానే అర్ధమైపోయింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏదొకటి చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతంది. దెబ్బకు దెబ్బ తీయాలని, ప్రతీకారం తీర్చుకోవాలనే కామెంట్లు సగటు భారతీయుడి నుంచి సెలబ్రిటీల వరకూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో భారత్‌పై ఉగ్రదాడికి తెగబడ్డ పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ […]

పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే..!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:34 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర ఘటన తర్వాత దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఈ దాడి వెనక ఉన్నది పాకిస్థానే అనే విషయం తొదరగానే అర్ధమైపోయింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏదొకటి చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతంది. దెబ్బకు దెబ్బ తీయాలని, ప్రతీకారం తీర్చుకోవాలనే కామెంట్లు సగటు భారతీయుడి నుంచి సెలబ్రిటీల వరకూ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో భారత్‌పై ఉగ్రదాడికి తెగబడ్డ పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఆ సమయంలో పాక్ ఎదురు తిరగకుండా సర్జికల్ స్ట్రైక్స్ అస్సలు జరగలేదని పాక్ ప్రజలకు సర్ధి చెప్పుకుంది.

అయితే మరి ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ మేరకు ఒకవేళ యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉండనుంది..? బలాబలాల పరంగా చూస్తే భారత్ కన్నా పాకిస్థాన్ చాలా వెనబడి ఉంది. రక్షణ రంగానికి భారత్ కేటాయించే బడ్జెట్ కన్నా పాకిస్థాన్ బడ్జెట్ ఐదు రెట్టు తక్కువ. ఇది పక్కన పెడితే అసలు ఆర్ధికపరంగా పాకిస్థాన్ బలంగానే లేదు. చాలా వీక్‌గా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే దివాళ దిశగా ఉందని చెప్పక తప్పదు. మంత్రులు వాడే కార్లు, ఇతర ఖర్చులను కూడా తగ్గించుకునే పరిస్థితిలో ఉంది.

మరి ఈ స్థితిలో బలంగా ఉన్న భారత్‌తో పాకిస్థాన్ యుద్ధం చేయడం పాక్‌కే చాలా నష్టం. అయితే పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే భారత్‌కు నష్టమే కానీ భారత్ అంతకంటే ఎక్కువగానే అణ్వాయుధ దాడి చేసే చాన్స్ ఉంది. పాకిస్థాన్‌కు ఒక పెద్ద అండ ఉంది. అదే చైనా. శత్రువుకు శత్రువు మిత్రుడౌతాడనే సామెత ఇక్కడ కరెక్ట్‌గా పని చేస్తుంది.

భారత్‌కు చైనాకు పడదు కాబట్టే పాకిస్థాన్‌కు చైనా కావాలనే సహాయం చేస్తుందనే వాదనలున్నాయి. అయితే దొడ్డిదారిలో సహాయం చేస్తుందేమో కానీ నేరుగా మాత్రం కలగజేసుకోదు. ఎందుకంటే చైనాకు భారత దేశమే అతిపెద్ద మార్కెట్. భారత్ గనక చైనా వస్తువులను బ్యాన్ చేస్తే ఇక ఆ దేశం ఆర్ధికపరంగా బాగా నష్టపోతుంది.

ఆ విషయం తెలిసే చైనా ఆచితూచి అడుగులు వేస్తుంది. పాకిస్థాన్‌కు నేరుగా సహకరించదు. దీంతో భారత్, పాక్‌ల మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే అది పాకిస్థాన్‌కు తీరని నష్టమే అవుతుంది. మరి పాకిస్థాన్‌ యుద్ధానికి దిగనప్పుడు భారత్ ముందడుగు వేస్తే అంతర్జాతీయ వేదికపై నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గతంలో మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే