రాష్ట్రపతి పాలన దిశగా.. వెస్ట్ బెంగాల్..?

ధర్నాలు, ర్యాలీలతో వెస్ట్ బెంగాల్ రావణ కాష్టంలో మారింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల, మంటల యుద్ధం ఆగడంలేదు. బెంగాల్లో తమ కార్యకర్తలపై జరగుతున్న రాజకీయ దాడులను నిరసిస్తూ.. బుధవారం బీజేపీ ర్యాలీ తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీకి దిగారు. అయితే ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన హింసలో దాదాపు 15 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ […]

రాష్ట్రపతి పాలన దిశగా.. వెస్ట్ బెంగాల్..?
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 8:24 AM

ధర్నాలు, ర్యాలీలతో వెస్ట్ బెంగాల్ రావణ కాష్టంలో మారింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల, మంటల యుద్ధం ఆగడంలేదు. బెంగాల్లో తమ కార్యకర్తలపై జరగుతున్న రాజకీయ దాడులను నిరసిస్తూ.. బుధవారం బీజేపీ ర్యాలీ తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీకి దిగారు.

అయితే ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన హింసలో దాదాపు 15 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ కమలాపాటి త్రిపాఠి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. ఇవాళ జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై గవర్నర్ చర్చించే అవకాశాలున్నాయి. అటు గవర్నర్ భేటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల నేతలతో హింసపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. దాని పరిణామాల తర్వాత కేంద్రానికి రిపోర్టు ఇవ్వనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బెంగాల్ – నాన్ బెంగాలీ యుద్ధంగా మార్చిన మమతా బెనర్జీ.. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో మరింత ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ ర్యాలీ చేపట్టింది. ఎన్నికల్లో గెలిచిన 18 మంది ఎంపీలు, రాష్ట్ర ఇన్ ఛార్జీ కైలాష్ విజయవర్గీయులు, దిలీప్ ఘోష్, ముకుల్ రాయ్ సహా ఇతర బీజేపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మమత సర్కార్ కు వ్యతిరేకంగా నినదిస్తున్న బీజేపీ శ్రేణులపై లాఠీలు విరిగాయి. భాష్పవాయు ప్రయోగం జరిగింది. వెల్లింగ్టన్ ప్రాంతం నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు ఉన్న లాల్ బజార్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ.. బౌ బజార్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు ముకుల్ రాయ్, రాజూ బెనర్జీ లాఠీ చార్జీలో గాయపడ్డారు. దీంతో తీవ్ర స్థాయి వీధిపోరాటం బెంగాల్‌లో సాగుతున్న రాజకీయ యుద్ధాన్ని ప్రతిబింబించింది. ఇది ప్రజాస్వామ్య హననం అంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఈ పోరాటం ఆపబోమని.. ఇది ప్రారంభం మాత్రమేనని పిలుపునిచ్చారు.

అయితే ఈ పరిస్థితులను చూసిన గవర్నర్.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం రావచ్చని వెల్లడించారు. హింస రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఆర్టికల్ 356ని ప్రయోగించే పరిస్థితి వస్తుందన్నారు.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!