విషాదం: పడవ బోల్తా.. 50 మంది గల్లంతు..!
పశ్చిమబెంగాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మిడ్నాపూర్ జిల్లాలో నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వరదలో కొట్టుకుపోతున్న 10 మందిని జాలర్లు కాపాడారు. కాగా, బోటులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఒడ్డుకు చేరిన వారు చెబుతున్నారు. మిగతా వారిని కాపాడటానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మర బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పడవ బోల్తా పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డుకు చేరిన వారిలో […]
పశ్చిమబెంగాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మిడ్నాపూర్ జిల్లాలో నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వరదలో కొట్టుకుపోతున్న 10 మందిని జాలర్లు కాపాడారు. కాగా, బోటులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఒడ్డుకు చేరిన వారు చెబుతున్నారు. మిగతా వారిని కాపాడటానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మర బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పడవ బోల్తా పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డుకు చేరిన వారిలో కొందరికి స్వల్పగాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటు నడుపుతున్న వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా.. ప్రైవేటుగా బోటును నడుపుతున్నారని స్థానికులు తెలిపారు.