ఓవల్‌లో అత్యధిక ఛేజింగ్ ఇదే.. 121 ఏళ్లలో ఒక్కసారే..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది.

ఓవల్ మైదానంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి.

ఓవల్ మైదానంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పరుగుల వేట ఎంత అనేది ఇప్పుడు తెలసుకుందాం.

ఈ మైదానంలో 4వ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేజ్ చేసిన జట్టు ఏదో కూడా చూద్దాం.

టెస్టు క్రికెట్ చరిత్రలో ఓవల్ మైదానంలో అత్యధిక పరుగుల ఛేజింగ్ 263 పరుగులుగా నిలిచింది.

ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగో ఇన్నింగ్స్‌లో 263 పరుగులను ఛేదించింది.

ఈ మైదానంలో ఏ జట్టూ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.

దాదాపు 121 ఏళ్ల క్రితం 1902లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది.

అయితే, ఓవల్ మైదానం గణాంకాలు టీమ్ ఇండియాకు మంచి సంకేతం కాదు.

భారత జట్టు 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని అందుకోగలదా? లేదా డ్రా చేసుకోగలదా అనేది చూడాలి.