విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ చిత్రంలో  నటిస్తున్నసంగతి తెలిసిందే.

శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

సెప్టెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తుంది చిత్ర బృందం.

ఇటీవలే అలెప్పీలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఈ చిత్రం కశ్మీర్‌లో మే తొలి వారం నుంచి  కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో హీరో విజయ్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వారంలో  ఈ షెడ్యూల్‌ పూర్తిచేసుకొని కాకినాడ, హైదరాబాద్‌ చుట్టుపక్క ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు.

దీని తర్వాత టర్కీలో ఓ పాట చిత్రీకరించి చిత్రం షూటింగ్ ముగించనున్నట్లు తెలిసింది.

కశ్మీర్‌ నేపథ్యంగా సాగే వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు.