"గీత గోవిందం" తో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ - పరశురామ్‌లు మరో చిత్రాన్ని చేయనున్నారు

ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా  ఎస్.వి.సి క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు

సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ మూవీతో విజయ్ తొలిసారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ పతాకంలో పని చేయనుండడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన విషయాలని ఆదివారం అధికారికంగా ప్రకటించరు

ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల వంటి ఇతర వివరాలని త్వరలోనే తెలుపనున్నారు

ఈ చిత్రం ‘గీతా గోవిందం’ చిత్రానికి సీక్వెల్ అని కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది

ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో వహిస్తున్న ఖుషి మూవీలో నటిస్తున్నారు

ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది