హిందూ సంప్రదాయంలో లక్ష్మీ దేవిని పూజిస్తే సంపంద, కీర్తి పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

చేతిలో డబ్బు నిలవకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. మనం నిత్యం డబ్బుతో ఏదో ఒక పనిచేస్తుంటాం.

సమయంలో మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. అలా చేయడం వల్లే లక్ష్మీ దేవికి కోపం వచ్చి.. ఆర్థిక కష్టాలు వస్తాయట.

అందుకే డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.పర్స్‌లో కరెన్సీ నోట్లు, నాణేలతో పాటు ఎలాంటి ఆహార పదార్థాలను ఉంచకూడదు.

కొందరు చాక్లెట్స్, సోంపు వంటి పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల డబ్బుకు అవమానం జరుగుతుందట.

మీరు ఎవరైనా పేదవారు, యాచకులకు డబ్బులు దానం చేసేటప్పుడు.. నోట్లను గానీ, నాణేలను గానీ విసిరేయకూడదు.

ఇలా చేస్తే లక్ష్మి దేవిని అవమానించినట్లే, అందుకే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు విసిరి వేయకుండా.. వారి చేతికి అందివ్వాలి.

కొందరు నోట్లను లెక్కబెట్టే సమయంలో.. పదే పదే చేతి వేళ్లను నోట్లోపెట్టుకుంటారు. వేలిని ఉమ్ముతో తడిచేసి.. ఆ తర్వాత లెక్కపెడతారు. కానీ ఇలా చేయకూడదు.