19 April 2024

Hydలో విశాల్ ‘రత్నం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణమిదే

Rajitha Chanti

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘రత్నం’. సింగం సినిమాల ఫేమ్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్.

స్టోన్‌బెంచ్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత కార్తికేయన్‌ సంతానం రత్నం సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

 ప్రస్తుతం పోస్ట్   ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న రత్నం సినిమా ఏప్రిల్ 26న తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

మోషన్లలో భాగంగా ఇటీవలే రత్నం సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఇది యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్ పనుల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా శుక్రవారం (19) ప్రి రీలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఇందుకోసం హైద‌రాబాద్‌లోని నరసింహ రెడ్డి కాలేజీని వేదిక‌గా ఎంచుకున్నారు. అయితే  ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.  ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు విశాల్.

రత్నం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు తాను చాలా బాధపడ్డానన్నాడు విశాల్. త్వరలోనే మరింత గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేస్తామన్నాడు.

అయితే ఉన్నట్లుండి రత్నం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో సరైన కారణాలు తెలియరాలేదు. విశాల్ కూడా క్లారిటీ ఇవ్వలేదు.