02 November 2023

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య

వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి బుధవారం (నవంబర్ 1) ఇటలీలో వివాహం చేసుకున్నారు. 

గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

వరుణ్ తేజ్, లావణ్యల వివాహ వేడుకను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది.

ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. రామ్ చరణ్ కూతురు క్లింకార సందడి చేసింది.

పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి కారణం ఉంది. 'మిస్టర్' సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది.

అక్కడ వారి ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టిన దగ్గరే పెళ్లి కూడాజరగాలని నిర్ణయించుకున్నారు. అందుకే వీరివివాహం ఇటలీ లో జరిగింది.