నా పిల్లలకు వారి గురించి చెబుతాను: శోభితా ధూళిపాళ్ల

02 October 2024

Basha Shek

ఈ ఏడాది ఆగస్టులో టాలీవుడ్‌ హీరో నాగచైతన్యతో  హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా  జరిగింది.

ఇరు కుటుంబాలు, అత్యంత సన్నహితులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారీ లవ్ బర్డ్స్.

ఈ ఏడాది ఆఖరులోనైనా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుందని తెలుస్తోంది.

కాగా నిశ్చితార్థం వేడుక మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్ లో బిజీ అయిపోయారు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల.

ఈ క్రమంలో శోభితా ధూళిపాళ్ల నటించిన పొన్నియిన్ సెల్వన్‌-1’ సినిమా విడుదలై  రెండేళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ బచ్చన్ తదితరులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది శోభిత.

‘వీళ్లందరూ ఎవెంజర్స్‌.  నా పిల్లలకు వీరి గురించి చెబుతాను’ అంటూ తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన ఇచ్చిందీ అందాల తార.

శోభిత షేర్ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.