TV9 Telugu

టిల్లు స్క్వేర్ కలెక్షన్ల వర్షం.. సిద్దూ రేంజ్ మారిపోయినట్టే

31 March 2024

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నల గడ్డ నటించిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఇందులో కథానాయికగా నటించింది

మార్చి 29న విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళుతోంది. రూ. 50 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

నిర్మాత నాగవంశీ చెప్పినట్లు టిల్లు స్క్వేర్ త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇదే సినిమాతో హీరో సిద్దూ జొన్నలగడ్డ రేంజ్ కూడా మారిపోయిందంటున్నారు. చిన్న హీరో స్థాయి ట్యాగ్ ఉన్న స్టార్ బాయ్ ఇక మీడియం రేంజ్ కు ఎదిగినట్టేనంటున్నారు.

టిల్లు స్క్వేర్ సినిమా కలెక్షన్ల ప్రభంజనంతో సిద్ధూ కూడా నాని, విజయ్ దేవరకొండ, రామ్‌, అడివి శేష్‌ల సరసన చేరిపోయనట్టేనంటున్నారు.

సిద్ధూకు కేవలం యాక్టింగ్ పైనే కాకుండా, రైటింగ్ లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. రాబోయే రోజుల్లే ఇదే అతనికి క్రేజ్ తెచ్చిపెడుతుందంటున్నారు.

టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు ఇంకా  ఒకటి, రెండు పడితే సిద్ధూకు టాలీవుడ్ లో తిరుగులేదంటున్నారు అభిమానులు.

మల్లిక్ రామ్ టిల్లు స్క్వేర్ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ తో కలిసి సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.