పెళ్లి విషయంలో ఒత్తిడి పెరిగిందంటోన్న శ్రుతి హాసన్.. ఇదో సమస్యనా ?

01 November 2023

Pic credit - Instagram

కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతిహాసన్. అతి తక్కువ సమయంలోనే నటనతో స్టార్ డమ్ అందుకుంది

నటిగానే కాకుండా గాయనిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 30 ఏళ్లు దాటాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. 

30 ఏళ్లు దాటిన తర్వాత ఎంతో ధైర్యం వచ్చిందని.. పూర్తిగా మారిపోయానని.. ఇప్పుడు ఏ విషయానికైనా.. దేనికైనా ధైర్యంగా సమాధానం చెబుతున్న అన్నారు. 

ఇప్పుడు మరింత ప్రశాంతంగా ఉంటున్నానని.. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. వయసు దాటిపోయిందని ప్రశ్నిస్తుంటారని చెప్పుకొచ్చింది. 

దీంతో పెళ్లి విషయంలో తాను ఒత్తిడికి గురవుతున్నానని.. పెళ్లెప్పుడు చేసుకుంటావంటూ ప్రశ్నిస్తున్నారని.. 30 తర్వాత ఇదో సమస్యగా అడుగుతున్నారని తెలిపింది. 

కానీ వయసు అనేది తన దృష్టిలో సమస్యే కాదని.. అందుకే అలాంటి ప్రశ్నలను పట్టించుకోవడం మానేసి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. 

30 ఏళ్ల తర్వాత వృత్తి పరంగానూ మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె సలార్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. 

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.