21 September 2023

ఎయిర్ పోర్ట్ ఘటనపై స్పందించిన శ్రుతిహాసన్.. అతనెవరో తెలియదంటూ.. 

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. 

ఇటీవల ముంబై విమానాశ్రయంలో శ్రుతికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆమె నడుస్తుండగా ఓ ఆగంతకుడు వెంబడించాడు. 

ఎయిర్ పోర్టులో శ్రుతి హాసన్ నడుస్తుండగా.. ఓ వ్యక్తి అభిమానినంటూ ఆమెను వెంబడించాడు. ఆమె దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించాడు. 

 శ్రుతి కారు ఎక్కే వరకు ఆమెను ఫాలో అయ్యాడు. అతడి చేష్టలతో భయపడిన శ్రుతి.. ఎవరు అంటూ అతడిని నిలదీయడంతో వెనక్కు వెళ్లిపోయాడు. 

తాజాగా ఆ విషయంపై శ్రుతి తన ఇన్ స్టా చిట్ చాట్ లో స్పందించింది. తన వెంట పడిన ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఇన్ స్టాలో తెలియజేసింది. 

తాను ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వస్తుండగా.. ఓ వ్యక్తి వెంట రావడం గమనించానని.. ఫోటో కోసం వస్తున్నాడేమో అని అనుకున్నట్లు తెలిపింది. 

అంతలో ఫోటోగ్రాఫర్ ఆమె పక్కకు వెళ్లి నిల్చొమని అతడికి చెప్పాడని.. వాళ్లిద్దరూ స్నేహితులేమో అనుకున్నట్లు చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. 

జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని.. అందుకే బాడీ గార్డ్స్ ను పెట్టుకోలేదని ఇప్పుడు ఆ విషయం పై ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది.