24 November 2023

'అర్జున్ రెడ్డి' మూవీపై రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 

Pic credit - Instagram

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. 

ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించగా.. అతడి జోడిగా రష్మిక నటించింది. డిసెంబర్ 1న ఈ మూవీ తెలుగు, హిందీలో రిలీజ్ కానుంది. 

 ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్న రష్మిక అర్జున్ రెడ్డి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా సందీప్ రెడ్డి తెరకెక్కించారంటూ ప్రశంసలు కురిపించింది. ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారని తెలిపింది. 

కానీ తనకు మాత్రం అర్జున్ రెడ్డి సినిమా సహజంగానే అనిపిస్తుందని..ఆ సినిమా ఎంత వినోదాన్ని అందించిందో.. యానిమల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందని తెలిపింది. 

యానిమల్ సినిమాలో నటించడంతో తనకు మంచి అనుభూతిని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇక రణబీర్ సైతం అర్జున్ రెడ్డి సినిమాపై స్పందించారు. 

యానిమల్ సినిమాలో తన పాత్ర పై కాస్త అర్జున్ రెడ్డి ప్రభావం ఉంటుందని అన్నారు. గురువారం విడుదలైన ట్రైలర్ యానిమల్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించగా.. బాబీ దేవోల్ ప్రతినాయికుడిగా కనిపించారు.