మహేష్ సినిమా కోసం ప్రియాంక రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
30 January 2025
Basha Shek
టాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎదురుచూస్తున్నచిత్రం ఎస్ఎస్ఎమ్ బీ29.
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది.
ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. తాజాగా కీరవాణి, రాజమౌళిలతో ఆమె దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇప్పటికే ఎస్ ఎస్ ఎమ్ బీ 29 సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ఫ్రీ లుక్ టెస్ట్ అన్ని కూడా ప్రియాంక పూర్తి చేసుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే మహేష్ బాబు- రాజమౌళి సినిమా కోసం ప్రియాంక తీసుకుంటున్న రెమ్యూనరేషన్కు గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
మహేశ్ మూవీ కోసం ప్రియాంక ఏకంగా సుమారు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో హాలీవుడ్ మీడియా మాత్రం ప్రియాంక చోప్రా పారితోషికం సుమారు రూ.40 కోట్లు వరకు ఉంటుందంటోంది.
ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. పీసీ అడిగిన పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా ఒకే అన్నట్లు సమాచారం
ఇక్కడ క్లిక్ చేయండి..