10 December 2023

క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమంటోన్న హీరోయిన్ నేహా శెట్టి.. 

Pic credit - Instagram

 డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ నేహా శెట్టి. ఈ మూవీలో రాధిక పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. 

దీంతో తెలుగులో వరుస అవకాశాలు ఈ అమ్మాయికి క్యూ కట్టాయి. ఇటీవలే బెదురులంక  2012, రూల్స్ రంజాన్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. 

ప్రస్తుతం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నేహా. 

 తెలుగులో వరుసగా సినిమాలు చేయకపోవడంపై స్పందించింది. తనకు క్యాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదట. 

ఇటీవలే న్యూయార్క్ ఫిలిం అకాడమీలో 4 నెలల కోర్స్ పూర్తిచేసింది నేహాశెట్టి. నటిగా తనను తాను మెరుగుపర్చుకోవడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుందట. 

నటిగా వైవిధ్యంగా కనిపించాలని.. భిన్నమైన పాత్రలలో నటించాలనే తన ప్రయత్నానానికి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో చేసిన కోర్సు ఉపయోగపడుతుందని అన్నారు. 

ఈ కోర్స్ ద్వారా నేర్చుకున్న విషయాలతో నటిగా తాను మరింత మెరుగయ్యానని.. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో బుజ్జి పాత్రలో మరింత ఆకట్టుకుంటానని తెలిపింది. 

గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కానుంది.