03 December 2023

ఊహలకు మించిన కథలు వస్తున్నప్పుడు ఆలోచన ఎందుకు.. కీర్తి సురేష్.. 

Pic credit - Instagram

మహానటి కీర్తి సురేష్‏కు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. నానితో దసరా, ఉదయనిధి స్టాలిన్‏తో మామన్నన్ సినిమాలతో భారీ హిట్స్ అందుకుంది కీర్తి. 

స్క్రిప్ట్ ఎంపికలలో మీ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయా ? అడగ్గా.. తనదైన శైలీలో ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. 

ఒక హిట్టు పడగానే.. లేదా ప్లాప్ వచ్చిందనో అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఎంపికలో మన ఆలోచన విధానం మారిపోదుని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. 

 ఎప్పటికప్పుడు భిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకుంటానని.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుకుంటానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం తనది ప్రయోగాలు చేసే సమయమని.. కానీ తన దగ్గరికి వస్తున్న కథలు, పాత్రలు తన ఊహలు, కలలు మించినవి ఉంటున్నాయని తెలిపింది. 

అలాంటి సమయంలో మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుందని.. ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనుకుంటున్నాని తెలిపింది. 

 కీర్తి సురేష్ ప్రస్తుతం సైరెన్, రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలతో బిజీగా గడిపిస్తుంది. అలాగే రాధికా ఆప్డేతో అక్క అనే సిరీస్ చేస్తుంది. 

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.