హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఏం జరిగిందంటే?
03 April 2025
Basha Shek
హీరోయిన్ హన్సిక మోత్వానీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ ఆమె బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
వివరాల్లోకి వెళితే.. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ను వివాహం చేసుకున్నాడు.
యితే ఆ తర్వాత విభేదాలు రావడంతో 2022లోనే విడిపోవాలని ప్రశాంత్, ముస్కాన్ నాన్సీ జేమ్స్ నిర్ణయం తీసుకున్నారు
ఆ సమయంలోనే తనను వేధింపులకు గురి చేశారంటూ హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ముస్కాన్.
ఈ క్రమంలోనే హన్సికా మోత్వానీ, ఆమె తల్లి జ్యోతిపై హాన్సిక సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద గృహ హింస కేసు పెట్టింది.
ఈ నేపథ్యంలోనే తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హన్సిక బాంబే హైకోర్ట్ను ఆశ్రయించింది. గురువారం (ఏప్రిల్ 04)న న్యాయస్థానం ఈ పిటిషన్ ను విచారించింది.
హీరోయిన్ హన్సిక మోత్వానీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ ఆమె బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్కు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది
కాగా ఇప్పటికే ఈ కేసులో హన్సిక మోత్వానీకి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి..