విక్రమ్‌ను అవమానించేలా జర్నలిస్ట్ ప్రశ్న.. 

TV9 Telugu

12 August 2024

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇప్పుడు తంగలాన్ సినిమా ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నాడు. పా. రంజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న పిరియాడికల్ యాక్షన్  మూవీపై  విక్రమ్ తో పాటు ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా తంగలాన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న చియాన్ విక్రమ్ కు ప్రెస్ మీట్ లో మీడియా రిపోర్టర్ల నుంచి ఒక అవమానకర ప్రశ్న ఎదురైంది.

కోలీవుడ్‌లో సూర్య,అజిత్, విజయ్‌ వంటి స్టార్ హీరోలకు ఉన్నంత రేంజ్‌లో మీకు అభిమానులు ఉన్నారా..? అని ఒక జర్నలిస్ట్ విక్రమ్ ను అడిగాడు.  

దీనికి అదరిపోయే సమాధానం ఇచ్చాడు విక్రమ్ 'నా ఫ్యాన్స్ గురించి మీకు ఏమీ తెలియదు అనుకుంటున్నాను. సినీ అభిమానులంతా నా అభిమానులే'

'అందుకు రుజువు కావాలంటే ఆగష్టు 15న తంగలాన్ సినిమా థియేటర్‌కి రండి. అక్కడ నా అభిమానుల బలం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడండి' అని చెప్పుకొచ్చాడు.

తనకు టాప్ హీరో లిస్ట్‌లో ఉండటం ముఖ్యం కాదు. ప్రేక్షకులే అభిమానేమే ముఖ్యమని మీడియా జర్నలిస్టుకు కౌంటరిచ్చాడు విక్రమ్.

 'తంగలాన్ కోసం నా బెస్ట్ ఇచ్చాను. నా విషయానికొస్తే అందరూ ఏదో ఒక విధంగా నా అభిమానులే. విక్రమ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.