12 September 2023

ప్రమోషన్లకు దూరమైనా ఒక్క వీడియోతో కనిపించి గుడ్ న్యూస్ పంచుకున్న అనుష్క శెట్టి.. 

Pic credit - Instagram

చాలా కాలం తర్వాత అనుష్క నటించిన లేటేస్ట్ చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా.. మహేష్ బాబు దర్శకత్వం వహించారు. 

సెప్టెంబర్ 7న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ అదే సమయంలో షారుఖ్ నటించిన జవాన్ రిలీజ్ కావడంతో కలెక్షన్స్ తగ్గాయి. 

ఇక ఈ వీకెండ్ లో మిస్ శెట్టి కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే శని, ఆదివారాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కలెక్షన్స్ పెరిగాయి. 

అయితే ఈ సినిమా ప్రమోషన్లకు అనుష్క దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం నవీన్ మాత్రమే ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

 తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియోలో కనిపిస్తూ శుభవార్త పంచుకుంది అనుష్క.  తెలుగు రాష్ట్రాల్లోని ఆడవారికి అన్ని చోట్ల ఉచితంగా షో ప్రదర్సించనున్నట్లు తెలిపింది. 

అయితే చాలా కాలం తర్వాత ప్రమోషన్ వీడియోలో అనుష్క కనిపించింది. దీంతో దేవసేనను వీడియోలో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 బాహుబలి, నిశ్శబ్దం సినిమాల తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల గ్యాప్ తర్వాత అనుష్క మరోసారి వెండితెరపై కనిపించింది. 

ఈ చిత్రంలో అన్విత పాత్రలో మరింత అందంగా కనిపించింది అనుష్క. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా.. సెప్టెంబర్ 7న విడుదలైంది.