05 September 2023

ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన రష్మిక మందన్నా.. కానీ.

Pic credit - Instagram

కిరిక్ పార్టీతో సినీరంగంలోకి అడుగుపెట్టిన రష్మిక.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు సంపాదించుకుంది. 

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తుంది. 

పుష్ప సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇటు తెలుగులోనే కాకుండా హిందీలోనూ అవకాశాలు అందుకుంటుంది. 

ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైనట్లుగా తెలుస్తోంది. 

ఇప్పటికే ఫిలింఫేర్, సైమా అవార్డులను గెలుచుకున్న రష్మిక.. ఇప్పుడు ప్రతిష్టాత్మక అవార్డు రేసులో దూసుకుపోతుంది. 

ఉత్తమ ఆసియా నటి విభాగంలో రష్మిక సెప్టిమస్ అవార్డుకు ఎంపికైంది. ఈ విభాగంలో రష్మికకు గట్టిపోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఉత్తమ ఆసియా నటి విభాగంలో రష్మికతోపాటు ఎనిమిది మంది నటీమణులు.. ఇతర ఆసియా దేశాల నటీమణులు పోటీలో ఉన్నారు. 

అయితే ఈ అవార్డు రష్మికకు రావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగైదు చిత్రాల వరకు ఉన్నాయి.