ఆ హీరోతో నటించాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన  కీర్తి

TV9 Telugu

01 August 2024

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది కీర్తి సురేశ్‌.

 ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా కనిపిస్తోందీ అందాల తార.

ప్రస్తుతం సుమన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ మూవీలో ‘రఘు తాత’  లీడ్ రోల్ చేస్తోంది కీర్తి సురేశ్.

ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

తాజాగా రఘు తాత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న కీర్తి సురేశ్  తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో కలిసి వర్క్ చేయాలని ఉందని ఈ సందర్భంగా తన మనసులోని కోరికను బయట పెట్టింది కీర్తి సురేశ్.

'శింబు అంటే నాకు చాలా ఇష్టం. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఒకటి, రెండు సార్లు తనతో ఫోన్లో కూడా మాట్లాడాను' అని చెప్పుకొచ్చిందీ అందాల తార

కనీసం ఒక్క సినిమాలో అయినా శింబుతో  కలిసి నటించాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయట పెట్టింది కీర్తి సురేశ్