గతేడాది ‘డీజే టిల్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ.

ఇప్పుడు అంతకు మించిన కామెడీతో ‘టిల్లు స్క్వేర్‌’ ప్రేక్షకుల ముందుకు రానున్నారు సిద్ధు.

ఈ చిత్రం ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా తెరకెక్కుతుంది.

మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సిద్ధుకి జోడిగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది.

తాజాగా సోమవారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్.

ఈ చిత్రాన్ని సెప్టెంబరు 15న విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

ఆ పోస్టర్‌లో సిద్ధు - అనుపమ రొమాంటిక్‌ లుక్‌లో ఆసక్తికరంగా కనిపించారు.

‘‘తొలి భాగాన్ని మించిన వినోదాన్ని, థ్రిల్‌ను ఈ రెండో భాగం అందిస్తుంది. ఇది ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది.

మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు మేకర్స్.