మీరు గోవా వెళ్లి పార్టీ చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..

గోవా టూర్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకునే వారు కొత్త నిబంధనలు గుర్తించుకోవాలి

పర్యాటకులు ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే భారీ ఎత్తున జరిమానా చెల్లించుకోక తప్పదు

అక్టోబర్ 31న గోవా ప్రభుత్వం జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఇక గోవా బీచ్ లో ఈ పాడు పనులు నిషేధం

ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం నిషేధం

గోవా ప్రభుత్వం బీచ్‌లలో డ్రైవింగ్ చేయడం నిషేధించింది

బీచ్‌లలో చెత్త వేయడం, మద్యం సేవించి సీసాలు పగలగొట్టడం వంటివి చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది

నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం పేర్కొంది