మాజీ భరత్ క్రికెట్ టీం కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే

ధోని, ఆయన భార్య సాక్షి కలిసి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌’అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించారు

తాజాగా తమ బ్యానర్‌పై  తెరకెక్కుతున్న మొదటి చిత్రానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు

హరీశ్ కళ్యాణ్ హీరోగా, ఇవానా  కథానాయకిగా ఈ చిత్రంలో నటిస్తున్నారు

ఈ సినిమాలో నదియా, యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

నూతన దర్శకుడు రమేష్ తమిళమణి  దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ఎల్‌జీఎం’ (లెట్స్‌ గెట్స్‌ మ్యారేడ్‌) - అనే టైటిల్‌ని ఫిక్స్ చేసారు

అలాగే దీనికి సంబంధించి  ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు

‘మంచి కథల ద్వారా దేశంలోని నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది’ అని  సాక్షి గతంలో తెలిపారు