రికార్డ్ స్థాయిలో మెట్రో ప్రయాణాలు..

అత్యాధునిక ప్రజా రవాణా హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు రికార్డు క్రియేట్ చేసింది.

మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన 2017 నవంబర్‌ 29 నుంచి ఇప్పటివరకు 40 కోట్ల మంది చేసారు.

ఈ విషయాన్ని శనివారం హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి  తెలిపారు.

పని దినాల్లో రోజుకు 4.9 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని అయన పేర్కొన్నారు.

మరికొన్ని రోజుల్లో రోజుకు 5 లక్షల మందికి చేరే అవకాశం ఉందని అన్నారు.

రోజూ మెట్రోలో ప్రయాణించే వారిలో ఎక్కువగా 1.40 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, 1.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

మెట్రో ప్రయాణాన్ని యువతరం ఎంజాయ్‌ చేస్తున్నారని చెప్పారు ఎన్‌వీఎస్‌ రెడ్డి.