ఈరోజు (26వ తేదీ) నుంచి శాఖల వారికా కొత్త సచివాలయానికి  షిఫ్టింగ్ షురూ కానుంది.

మూడు రోజుల్లో అంటే ఈ నెల 28వ తేదీకి  మొత్తం శాఖలన్నీ షిఫ్ట్​ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 30వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్నిప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

కొత్త సచివాలయంలో ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల చొప్పున కేటాయించారు.

గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండనున్నాయి.

ఇక.. మూడో ఫ్లోర్లోను అగ్రికల్చర్ & ఎస్సీ డెవలప్​మెంట్​ శాఖలకు కేటాయించడం జరిగింది.

నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా కేటాయించగా ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ ఉండనుంది.

ఇక సీఎం, సీఎస్ లకు ఆరో ఫ్లోర్లో  కేటాయింపులు చేస్తూ ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించి, కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు తెలుస్తోంది.