మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ  కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది

గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి.

అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలంలోని రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ముందుకారు అదుపు తప్పింది

ఆ తర్వాత వేరే కారులో కవిత బయలుదేరి వెళ్లారు. కవితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో పార్టీ నాయకులు, అభిమానులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.