ఆంధ్రాలో సెమీకండక్టర్‌ చిప్ తయారీ యూనిట్.. అసలు ఈ చిప్ ఎంటి.?

23 August 2025

Prudvi Battula 

స్వాతంత్ర్య దినోత్సవం రోజున, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భవిష్యత్ భారతదేశం గురించి తన దార్శనికతను వెల్లడించారు.

స్వావలంబన భారతదేశం, మేడ్ ఇన్ ఇండియాపై నొక్కి చెబుతూనే, రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల తయారీకి కేంద్రంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు.

సెమీకండక్టర్ అనేది సిలికాన్‌తో తయారు చేయబడిన చిప్. ఇది ప్రతి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కారు, టీవీ, వాషింగ్ మెషీన్, స్మార్ట్ పరికరాల్లో ఉపయోగించడం జరుగుతుంది.

సరళంగా చెప్పాలంటే, శరీరంలో మెదడు పనిచేసే విధంగానే, ఈ సెమీకండక్టర్ చిప్ స్మార్ట్ పరికరాల మెదడులా పని చేస్తుంది.

అనేక క్షిపణులలో సెమీకండక్టర్ చిప్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. తైవాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సెమీకండక్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రంగంలో భారతదేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో భారత్‌ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అంతర్జాతీయంగా నవీన ఆవిష్కరణలకు, భావి డిజిటల్‌ రంగాన్ని అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

కేంద్ర కేబినెట్‌ ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు మరికొన్ని రాష్ట్రాల్లో సెమీకండక్టర్‌ తయారీ యూనిట్లకు ఇటీవల ఆమోదం తెలిపింది.