16 March 2024
TV9 Telugu
చైనా టెక్నాలజీ సంస్థ వన్ ప్లస్ తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ను ఏప్రిల్ ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్తో పని చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ ధర రూ.25 వేలు ఉండొచ్చునని భావిస్తున్నారు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో (1440×3168 పిక్సెల్స్ రిజొల్యూషన్) 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్లో రేర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ మొబైల్లో50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా.
ఈ మొబైల్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది.
ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ 8జీబీ ర్యామ్తో వస్తున్న ఈ ఫోన్లో అదనంగా మరో 8 జీబీ ర్యామ్ వర్చువల్గా పెంచుకోవచ్చు.
ఇన్ బిల్ట్ స్టోరేజీ 256 జీబీ. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో వన్ టిబి వరకూ పెంచుకోవచ్చు. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ.