యూజర్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్‌‌.. ఇకపై పోస్ట్‌ పెట్టాలంటే డబ్బు కట్టాల్సిందే

19 October 2023

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ఎక్స్‌ (X) ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది.

ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ను అమల్లోకి తెచ్చింది ట్విట్టర్‌ ఎక్స్‌ (X).

కొత్త యూజర్లు పోస్ట్‌ చేయాలన్నా, రీ ట్వీట్‌ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, లైక్‌ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

‘నాట్ ఎ బాట్’ సబ్‌స్క్రిప్షన్ ఫీజు పేరుతో ఏడాదికి ఒక డాలర్‌గా ట్విట్టర్‌ ఎక్స్‌ (X) సంస్థ వసూలు చేయనుంది.

ఈ కొత్త నిబంధనను మొదట న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు ట్విట్టర్‌ ఎక్స్‌ (X) యాజమాన్యం.

స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది.

సభ్యత్వం పొందకూడదు అనుకునే వినియోగదారులు పోస్ట్‌లను చదవొచ్చు వీడియోలను చూడొచ్చు ఖాతాలను అనుసరించవచ్చు.

అంటే ఇకనుంచి పేమెంట్ చేయకపోతే పోస్ట్ పెట్టడానికి అవదు అన్నమాట. చూడాలి ఇది ఎంతవారుకు విజయవంతం అవుతుందో.